pawan-kalyan-announced-pithani-balakrishna-as-mummidivaram-candidateరెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు సిద్ధం అన్న జనసేన అధినేత, పార్టీ తరపున పోటీ చేసే తొలి అభ్యర్ధి పేరును ప్రకటించారు. అయితే ఇది తెలంగాణకు సంబంధించి మాత్రం కాదు, వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి!

అవును… మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలపై కనీస సమాచారం ఇవ్వని జనసేన అధినేత, వచ్చే ఏడాదిలో ఏపీ జరగబోయే ఎన్నికలకు పార్టీ తరపున తొలి బి ఫాంను పితాని బాలకృష్ణకే అందజేస్తామని అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి కానిస్టేబుల్ అని, పితాని కూడా కానిస్టేబుల్ అని… తమది పోలీస్ కులం అంటూ నవ్వులు పూయించారు.

అయితే పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి ప్రకటనలు ఊహించినవే. కీలకమైన సందర్భాలలో మ్యాటర్ ను డైవర్ట్ చేయడానికి జనసేన చేసే ప్రయత్నాలు తెలియనివి కావు. అందరూ తెలంగాణా ఎన్నికల గురించి చర్చిస్తున్న వేళ, వాటిని పక్కదారి పట్టించేలా తన పార్టీ తరపున తొలి అభ్యర్ధి అంటూ చేసిన ప్రకటన సహజంగానే మీడియా వర్గాలను ఆకర్షిస్తుంది.