పవన్ కళ్యాణ్ పరిటాల రవి చుట్టూ అనేక వివాదాలు ఉండేవి. గతంలో ఒక భూవివాదంలో రవి పవన్ కు గుండు కొట్టించారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేసారు. దానిని ఇరువర్గాలు ఖండించాయి. అయితే ఈ పుకార్లను కొందరు ఇంకా వ్యాపిస్తూ ఉంటారు. మరోవైపు పరిటాల రవీంద్ర అనుచరుడు రేగాటిపల్లి (చిలకం) మధుసూదన్రెడ్డి జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తాను తెలుగుదేశం పార్టీకు రాజీనామా చేస్తునట్టు ఆయన ప్రకటించారు. కార్యకర్తల నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరేదీ వెల్లడిస్తానన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు పవన్ కల్యాణ్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ధర్మవరం నుంచి జనసేన తరుపున పోటీ చేయడానికే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు బాహాటంగా చెబుతున్నారు.
గతంలో ఆయన సింగిల్ విండో అధ్యక్షుడిగా, సర్పంచుగా పనిచేశారు. అయితే చిలకం పార్టీని విడిచి వెళ్ళడం వల్ల ఎటువంటి నష్టం లేదని స్థానిక తెలుగుదేశం నాయకులు అంటున్నారు. రాయలసీమ మీద జనసేన కు పెద్దగా ఆశలు లేనట్టుగా కనిపిస్తుంది. గతంలో అనంతపూర్ నుండి పోటీ చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ తరువాత మాట మార్చారు. పూర్తిగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మీదే ఆశలు పెట్టుకున్నారు.