Pakistanis happy on team india lossఇండియా – వెస్టీండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఓటమి అశేష క్రికెట్ అభిమానులను నిరుత్సాహ పరిచినా, అనేక క్రికెట్ దిగ్గజాలను, ఇతర దేశపు క్రికెటర్లను మాత్రం తీవ్ర సంతోష పరిచింది. భారత్ చేతిలో భంగపాటు గురైన బంగ్లాదేశ్ జట్టు సభ్యుడు ముషాఫీర్ రెహ్మాన్… ‘ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని, చాలా ఆనందంగా ఉందని, బ్యాక్ గ్రౌండ్ లో టీవీలో టీమిండియా నిరుత్సాహపడుతున్న సెల్ఫీ’ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఇక, దిగ్గజ క్రికెటర్లు బ్రియాన్ లారా, మెక్ గ్రాత్, సక్లైన్ ముస్తాక్ భారత్ ఓటమిని పండుగ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసారు. సొంత జట్టు గెలుపొందిన ఆనందంలో లారా ఉండగా, తమను ఓడించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టినందుకు గానూ మెక్ గ్రాత్ మిక్కిలి సంతోషంలో మునిగి తేలినట్లున్నాడు. ఇక, ఇండియా ఓటమిని ఆకాంక్షించే వారిలో పాకిస్తాన్ దేశం ఎప్పుడూ ఒకటవ స్థానంలోనే ఉంటుంది గనుక్ ముస్తాక్ రియాక్షన్ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

‘పి టీవీ’లో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీరందరి తీరు చూస్తుంటే… ఇండియా అంటే ఒక్కొక్కరికి ఏ రేంజ్ లో కసి ఉందో అర్ధమవుతోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే అందరి కంటే అత్యంత కామెడీ కలిగించే ట్వీట్ మాత్రం బంగ్లా క్రికెటర్ ముషాఫీర్ దే. చేతులారా వాళ్ళు ఓటమి పాలయ్యి, కనీస క్రీడాస్ఫూర్తి కూడా లేకుండా వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యాడు.