pakistan-target-visakhapatnamఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల తరువాత పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రతీకార చర్యలు చేస్తుందన్న ఆసక్తి ప్రముఖులు, నిపుణుల నుండి సామాన్య ప్రజానీకం వరకు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ రీజనల్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణారావు మాట్లాడుతూ… పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగడం ఖాయమని, అయితే సాధారణ ప్రజానీకం భావిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రతీకార దాడులు కేవలం జమ్మూకాశ్మీర్ లోనే ఉండవని, భారత్ లోని సుదీర్ఘ సరిహద్దుల వెంబడి ఎక్కడి నుంచైనా పాకిస్థాన్ దాడులకు తెగబడే అవకాశం ఉందని అన్నారు.

1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో… పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీ ఎవరికీ దొరకకుండా భారత నావికా దళానికి ఆయువుపట్టైన విశాఖపట్టణం వచ్చి పోర్టును కకావికలం చేసేసి, వెనుదిరగాలని ప్లాన్ చేసుకుంది. అయితే భారత ప్రభుత్వం నీటిలో అమర్చిన వాటర్ ల్యాండ్ మైన్ పైకి అది రావడంతో ముక్కలైపోయింది. లేని పక్షంలో భారత్ ఊహించని నష్టాన్ని జరిపి వెళ్లి ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తాజాగా కూడా ఇలాంటి దాడులకు దిగే అవకాశం ఉందని అన్నారు. భారత్ కు 900 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్తాన్ తో మాత్రమే ఉందని, 4,000 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉందని వారు తెలిపారు. అంతేకాదు, సుదీర్ఘమైన తీర రేఖ కూడా భారత్ కు సరిహద్దుగా ఉందని వారు గుర్తు చేశారు. ఇలా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ప్రతీకార దాడికి దిగే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇలాంటి దాడులే కాకుండా, మానవ బాంబుల రూపేణా కూడా దాడులు జరగవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నారు.