Paatal Lok Trailer talkబాలీవుడ్ భామ అనుష్క శర్మ అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తుంది. పాతాళ లోక్ అనే పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15న విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది. ట్రైలర్ ని బట్టి ఇప్పటిదాకా ఇండియాలో వచ్చిన వెబ్ సిరీస్లలో ఇదే అత్యంత వియోలెంట్ అని చెప్పవచ్చు.

సుప్రసిద్ధ జర్నలిస్ట్ (నీరజ్ కబీ) పై హత్యాయత్నాన్ని ఛేదించడానికి ఒక జాడెడ్ పోలీసు అధికారి (జైదీప్ అహ్లవత్) ను నియమిస్తారు. అతను నలుగురుని అనుమానిస్తాడు. వారిలో ఒక మహిళ, ఒకరు కరడుగట్టిన నేరస్థుడు (అభిషేక్ బెనర్జీ). ఈ కేసు అతని జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుంది. అతనికి క్రూరమైన నేరస్థులు ఉండే లోకం – పాతాళ లోక్ తో విరోధం ఏర్పరుస్తుంది.

కథలో కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అయితే ట్రైలర్ లోనే వయోలెన్స్ ఎక్కువగా ఉంది. ఇక వెబ్ సిరీస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో. ట్రైలర్ ని చూస్తున్నంత సేపు.. జైదీప్ అహ్లవత్, అభిషేక్ బెనర్జీ పెర్ఫార్మన్స్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హార్దిక్ మెహతా ఈ వెబ్ సిరీస్ కు సృష్టికర్త, రచయిత మరియు దర్శకుడు. ఈ దర్శకుడు ఇటీవలే కమ్యాబ్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను పొందింది. దానితో ఈ వెబ్ సిరీస్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పుకోవాలి.