Only Celebrities left in Bigg Boss 2 Telugu ‘బిగ్ బాస్’ హౌస్ లోకి సెలబ్రిటీలతో సామాన్యులకు ఎంట్రీ ఇచ్చిన యాజమాన్యం, ఫైనల్ గా సామాన్యులకు ఎలిమినేట్ చేసి సెలబ్రిటీలను హౌస్ లో ఉంచింది. తొలివారం నుండి విజయవంతంగా హౌస్ లో కొనసాగుతోన్న విజయవాడ కుర్రాడు గణేష్, శనివారం నాడు ఎలిమినేట్ కాగా, హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు ఆదివారం పెవిలియన్ బాట పట్టారు.

ఇద్దరు సామాన్యులను రెండు రోజుల్లో ఎలిమినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులను బలిచేయడమే లక్ష్యంగా ఈ షో జరుగుతోందన్న విమర్శలు ఊపందుకున్నాయి. అందులోనూ ఓటింగ్ విధానంలో షో యాజమాన్యం అవలంబిస్తోన్న విధానం తొలినాళ్ళ నుండి విమర్శలకు తావిస్తోంది. ఈ సారైతే తెలుగు హీరోయిన్ మాధవిలత బహిరంగంగానే తన స్వరం వినిపించారు.

నూతన్ నాయుడు కంటే అమిత్ కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, అయినా నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసారంటే, ప్రేక్షకుల ఓటింగ్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రీ ఎంట్రీ ఇచ్చాడన్న కారణంతోనే నూతన్ నాయుడుని బయటకు పంపించేసారని, అమిత్ ను ఫైనల్ విజేతగా ప్రకటించినా ఆశ్చర్యం లేదని, ఇదంతా టీం హెడ్స్ నిర్ణయిస్తారంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.