Pattiseema project in West Godavari district“పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని, దీని నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను భగవంతుడు తనకు ఇచ్చాడని, అది పూర్తి చేసి తన నీతి, నిజాయతీ నిరూపించుకుని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతానని” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పట్టిసీమ’ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం, ప్రాజెక్టు పనుల పురోగతి గురించి ఇంజనీర్లను ప్రశ్నించారు.

అంతకుముందు పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిసీమ ప్రాజెక్టు ఒక కానుక అని, భారతదేశంలో ఎక్కడా కట్టనటువంటి పెద్ద ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ‘పోలవరం’ ప్రాజెక్ట్ మాత్రమేనని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తే తాము కూడా బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, తాను కూడా దీనిపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నానని, ప్రాజెక్టు క్వాలిటీగా ఉండాలని, అదే సమయంలో త్వరగా పూర్తి కావాలని, అవసరమైతే పర్యవేక్షణకు నిపుణులను నియమిస్తామని అన్నారు.