తెలుగునాట సంచలన విజయం సాధించిన “అర్జున్ రెడ్డి” తమిళంలో ‘వర్మ’ పేరుతో త్వరలో విడుదల కానుండగా, అతి త్వరలో హిందీ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. తెలుగు దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా ఇప్పటికే ఖరారు కాగా, తాజాగా హీరోయిన్ గా ‘భరత్ అనే నేను’ బ్యూటీ కియారా అద్వాని పేరును అధికారికంగా ప్రకటించారు.
గత రెండు రోజులుగా కియారా పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, తాజాగా అది అధికారికమైంది. తెలుగు ‘అర్జున్ రెడ్డి’లో కొత్తగా నటించిన షాలిని పాండే లిప్ లాక్ లకు, బోల్డ్ సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా నటించింది. బాలీవుడ్ లో ఇలాంటి సన్నివేశాలు సహజం గనుక, అంతకుమించి హిందీ ‘అర్జున్ రెడ్డి’లో సందీప్ వంగా ఏం చూపిస్తారో వేచిచూడాలి.