nandamuri-kalyan-ram-ntr‘జగన్ గారితో మన సినిమా కన్ఫామ్ అయిపోయిందని కళ్యాణ్ అన్నకు చెప్పింది నేనే’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ‘ఇజం’ ఆడియో వేడుకలో ప్రసంగించిన తారక్… “ఈ చిత్రం ఓకే అవగానే తన అన్న కల్యాణ్ రామ్ కు ఆ విషయం మొదట చెప్పింది తానేనని అంటున్న” సమయంలో… ఈ లోగా, జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మైక్ ను లాక్కున్న కల్యాణ్ రామ్ మాట్లాడుతూ… “ఆ న్యూస్ నాకు కరెక్టుగా ఫిబ్రవరి 4, 11.30 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. నెవర్ ఫర్ గెట్ దట్” అని అన్నారు.

అనంతరం, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘నాకు ఎప్పటి నుంచో దర్శకుడు జగన్ గారితో కల్యాణ్ అన్న కలిసి చేయాలని అనుకునేవాడిని. ‘టెంపర్’ చేసిన తర్వాత నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికి కారణం జగనే. ఆయనతో కలిసి పనిచేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే, ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక, మా అన్న గురించి మాట్లాడాలంటే.. ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.. తనకు అన్నీ అతనే. ఒక నటుడిగా ఈ సినిమా కోసం అన్న చాలా కష్టపడ్డాడు. ఏ విషయంలోనైనా కష్టపడితే ఆ ఫలితం విజయం రూపంలో మనకు దక్కుతుంది. ఈ చిత్రం ద్వారా అన్న విజయం సాధించాలి’ అని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

ఇక, ‘ఇజం’ చిత్ర హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కు వెళిపోదామా అనిపిస్తుండేదని, అంత ఉత్సాహం తమకు రావడానికి కారణం దర్శకుడు పూరీ జగన్నాథ్ అని అన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా చేశామని, ఆ ఉత్సాహం ఎలా ఉందంటే, పూరీ జగన్నాథ్ తో మళ్లీ వెంటనే ఇంకో సినిమా చేయాలనేంతగా ఉందని అన్నారు కల్యాణ్ రామ్.