NTR Ram Chara Mahesh Babu Photo Viral-గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో సందడి చేస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమా ఘనవిజయం సందర్భంగా మళ్ళీ కలిసిన రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ – మహేష్ బాబులు మళ్ళీ కలుసుకోవడం… ఫోటోలు దిగడం… అవి కాస్త సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయడం… వైరల్ కావడం… అలా జరిగిపోయాయి.

ముచ్చటగా ముగ్గురు హీరోలు కనపడుతున్న ఈ ఫోటోలో ఇండస్ట్రీలో ఉన్న మూడు పెద్ద కుటుంబాల హీరోలు దర్శనమిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా`ఈ మూడు “మెగా – నందమూరి – ఘట్టమనేని” కాంపౌండ్ హీరోలే అగ్ర స్థానంలో ఉంటూ వస్తున్నారు. అయితే ఈ ఫోటోలో అక్కినేని కాంపౌండ్ హీరో మిస్ అవ్వడం ఒక్కటే లోటు అని చెప్పాలి.

టాలీవుడ్ కు ఉన్న నాలుగు స్తంభాలులో ఆ మూడు కుటుంబాలతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో ఉన్న నాగచైతన్య, అఖిల్ లు వయసు రీత్యా వారి కంటే పిన్న వారు కావడంతో పాటు, ఇమేజ్, క్రేజ్ విషయంలోనూ నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ఆ ఒక్క కాంపౌండ్ కూడా ఈ ఫోటోలో ఉంటే, ఇది పరిపూర్ణం అయ్యేదేమో!