Ntrహరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు… కుటుంబాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చిందేమో అనిపించక మానదు. చంద్రబాబు స్వయంగా హరికృష్ణ పార్థీవదేహాన్ని మోయడం నుండి దహన సంస్కారాలు తదితర కార్యక్రమాలు ముగిసిన తర్వాత నేడు కుటుంబ సభ్యులతో “చిన్న” కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా భోజనం చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల వద్దకు వచ్చిన బాలకృష్ణ వారిద్దరితో కలిసి ముచ్చటించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపుగా రెండు నిముషాల నిడివి గల ఈ వీడియోలో బాలకృష్ణ మాట్లాడుతుండడం, దానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందించడం స్పష్టంగా కనపడుతోంది.

మంచికి జరిగిందో, చెడుకు జరిగిందో గానీ, ఇప్పటికైనా నందమూరి కుటుంబం ఒక్క తాటి మీదకు రావడం అభిమానులకు ఊరటనిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు అండగా నిలవాల్సిన బాధ్యత బాలకృష్ణ పైన ఉంది. తండ్రి లేని లోటును బాబాయ్ గా బాలయ్య పూరిస్తే ఫ్యాన్స్ కు అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు.