Kanna Lakshminarayanaఇటీవలే పదవి చేపట్టిన బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిన్నటి నుండి ఆయన శ్రీకాకుళంలో యాత్ర మొదలుపెట్టారు. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇటువంటి యాత్రలు చేయ్యాలని భావిస్తున్నారు.

అయితే శ్రీకాకుళం యాత్రతోనే పార్టీ ఉత్సాహం నిరుత్సాహపడిపోయింది. కన్నాతో ఉన్న పది మంది నాయకులు తప్ప ఆ యాత్ర ఎవరిని ఆకట్టుకోలేదు. రోడ్ల మీద ఓపెన్ టాప్ జీప్ లో కన్నా ముందుకు కదులుతుంటే కనీసం చేస్తున్న పనులు మాని ఎవరు వచ్చారా అని చూసే వాళ్ళు కూడా లేకపోవడం గమనార్హం.

దీనితో అన్ని జిల్లాలోను యాత్ర జరుగుతుందా అనేది అనుమానంగా మారింది. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కనీసం 2% ఓట్లు కూడా రావడం కష్టం ఆ పార్టీకి. అంతే కాకుండా 2019లో ఏ పార్టీ అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ కూడా మునగడం ఖాయం.