గత ఆదివారం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ హత్య చేసింది జూ.ఎన్టీఆర్ అభిమాని అనడం ఇంకా సంచలనం రేపింది. ఈ నైపధ్యంలో తన వంతు భాధ్యతగా పవన్ కళ్యాణ్ నిన్న ఉదయం తిరుపతి వెళ్లి చనిపోయిన వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించి వినోద్ తల్లికి భరోసా కూడా ఇచ్హారు. అలాగే రాష్ట్రంలో ఉన్న తన అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు.
ఇంతా జరుగుతున్నా జూ.ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై బయటికొచ్హి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఈ విషయంపై చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారట. అసలు ఆ హత్య చేసింది తన అభిమానేనా అని ఆరా తీస్తున్నారట. కానీ బయట మాత్రం తారక్ కు ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని, ఒకవేళ స్పందిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఇప్పటి వరకూ మాట్లాదలేదని కూడా అనుకుంటున్నారు. కానీ తొందరపడి ఏదోకటి మాట్లాడేకన్నా జూనియర్ అసలు మాట్లాడకపోవడం ఒకింత మంచిదేినన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ రాజకీయ నైపధ్యంలో ఉన్నాడు కనుక పైగా భాదితుల పక్షం కనుక బయటికొచ్హి మాట్లాడినా ఎలాంటి వివాదం రాదని, కానీ తారక్ పరిస్థితి అది కాదని చంపిన వ్యక్తి తన అభిమాని అని అంటున్నారు కనుక అసలు వాస్తవాలేమిటో క్షుణ్ణంగా తెలుసుకుని నిదానంగా వివరణ ఇస్తే బాగుంటుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.