No buyers for Ismart Shankar movieఎనర్జిటిక్ హీరో రామ్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డబల్ సిమ్ కార్డు అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంపై రామ్, పూరి జగన్నాధ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూరి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు… రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. ఎప్పుడో ఒక యావేరేజ్ సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేవు. దీనితో ఈ సినిమాపై వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో పూరి తన పైత్యం మరోసారి చుపించాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో సినిమాను కొనడానికి బయర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ముందు ఆంధ్ర రైట్స్ కు 10 కోట్లు డిమాండ్ చేసిన ఛార్మీ ఇప్పుడు ఏడు కోట్లకు తగ్గించినా తీసుకునే వారే లేరట. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయాల్సిందిగా దిల్ రాజు ను రిక్వెస్ట్ చేసినా దానికి ఆయన ఒప్పుకోలేదని తెలుస్తుంది. దీనితో అయినకాడికి అమ్ముకోవడమో లేక సొంతంగా విడుదల చేసుకోవడమో చెయ్యాలి.

18న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు కూడా రావాల్సి ఉండగా అది చివరి నిముషంలో వాయిదా పడింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ కు సోలో రిలీజ్ దొరికినట్టే. అది ఒక్కటే సినిమాకు ఇప్పుడు ప్లస్ పాయింట్. 19న సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా విడుదల ఉన్నా అది అసలు లెక్కలోకే రాదు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.