సూపర్ స్టార్ రజినీకాంత్ , స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న దర్బార్ లో నయనతార, నివేత థామస్ హీరోయిన్లు అని మనం ఎప్పటినుండో వింటూనే ఉన్నాం. అయితే నివేత థామస్ రజినీకాంత్ సరసన హీరోయిన్ గా కాకుండా సినిమాలో ఆయన కూతురిగా నటించనుండడం విశేషం. ఫామ్ లో ఉన్న హీరోయిన్ కూతురి పాత్ర పోషించడం విశేషమే.
దర్బార్ లో రజినీకాంత్ ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నారని కూడా నివేత ఈ సందర్భంగా తెలిపింది. 2018లో నివేత రెండు సినిమాలు – 118, బ్రోచేవారెవరురా విడుదల అయ్యాయి. 2019లో ఆమె తెలుగులో ఎటువంటి సినిమా సైన్ చెయ్యలేదు. దర్బార్ సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నట్టు సమాచారం.
జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తమిళంలో రజినికి సోలో రిలీజ్ వస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే తెలుగులో మాత్రం సంక్రాంతి సందర్భంగా పోటీ గట్టిగానే ఉండబోతుంది.
ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్లారు. వచ్చిన వెంటనే దర్బార్ సినిమా డబ్బింగ్ పూర్తి చేసి తన తరువాతి చిత్రం సిరుత్తై శివ సినిమాతో బిజీ కానున్నాడని చెన్నై సినీ వర్గాల సమాచారం. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలయ్యింది.