ఎన్నికల వ్యూహకర్తగా ఖ్యాతిగాంచిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జనతాదళ్(యునైటెడ్) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిహారు ముఖ్యమంత్రి, జేడీ(యు)సారధి నితీశ్కుమార్ మంగళవారం ఈ మేరకు నియామకం చేశారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ 2019 ఎన్నికల కోసం పని చేస్తున్నారు.
ఇటీవలే ఆయన రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించి జనతాదళ్(యునైటెడ్) లో చేరారు. జగన్ పార్టీ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో ఎన్డీయేలో కీలక భాగస్వామి ఐన జనతాదళ్(యునైటెడ్) లో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. తాను ఏ పార్టీలో ఉన్న తన సంస్థతో సంబంధం లేదని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు.
అయితే ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు ఈ సంజాయిషీ సరిపోతుందో లేదో చూడాలి. 2014 ఎన్నికలలో బీజేపీ తరపున పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఆ తరువాతి కాలంలో మోడీ అమిత్ షాల తో విభేదించి కొంత కాలం కాంగ్రెస్ కు పని చేసారు. ఇప్పుడు మళ్ళీ ఒకరకంగా కమలం పార్టీ గూటికే చేరినట్టు అయ్యింది.