Nithin - Sateesh Vegesna Srinivasa Kalyanam“శతమానం భవతి” చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” అనే సినిమాకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ కథను నాగార్జునతో చేయాలని భావించారు గానీ సెట్ కాలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దరి చేరింది.

గతంలో ఎన్టీఆర్ కు ‘బృందావనం’ వంటి హిట్ ఇచ్చిన దిల్ రాజు చెప్పడంతో, ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ కధకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కధ మరో హీరో వద్దకు వెళ్లిందని టాక్. ‘అ…ఆ…’తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్ కు ఈ కధ చెప్పడం, ఓకే అవ్వడం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు నితిన్ నటించే తదుపరి చిత్రం కూడా ఇదే అవుతుందని బలంగా హల్చల్ చేస్తోన్న సమాచారం. ఈ కధ బాగా నచ్చడంతో నితిన్ కూడా మాంచి ఉత్సాహంలో ఉండడంతో, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే పనుల్లో ‘దిల్’ రాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. నితిన్ ‘దిల్’ సినిమాతోనే రాజు గారి పేరు దిల్ రాజుగా మారిపోయింది.