Nithin reddy Akhilఅక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా పరిచయం అయిన ‘అఖిల్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అఖిల్‌’ చిత్రం రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ను రాబడుతుందని అంతా ఆశించారు. కాని ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఇక ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను సినిమా విడుదల కాక ముందు 7 కోట్లకు జెమిని టీవీ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. కాని ‘అఖిల్‌’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సినిమాను 10 కోట్లకు అయితేనే అమ్ముతాం అంటూ నిర్మాత నితిన్‌ డిమాండ్‌ చేశాడు. దాంతో జెమిని టీవీ వెనక్కు తగ్గడం జరిగింది.

సినిమా విడుదల తర్వాత తాము ఆశించిన స్థాయిలో శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా వస్తాయని నిర్మాత నితిన్‌ భావించాడు. కాని సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో వస్తాయని ఆశించిన పది కోట్లు వస్తాయన్న నమ్మకం పోయింది. విడుదలకు ముందు జెమిని టీవీ 7 కోట్లకు తీసుకుంటాం అంటూ ముందుకు వచ్చినా, ఇప్పుడు కనీసం 5 కోట్లు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది. ప్రస్తుతం 3.5 కోట్లు మాత్రమే జెమిని వారు ‘అఖిల్‌’కు ఇస్తామని అంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేష్ఠ్‌ మీడియాకు జెమిని టీవీకి మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.