Rangde -Nithiin Keerthy Sureshయంగ్ హీరో నితిన్ మంచి జోరు మీద ఉన్నాడు. ఇప్పటికే వారం తిరగకుండానే రెండు సినిమాలకు కొబ్బరికాయ కొట్టాడు. అందులో ఒక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఈరోజు మూడవ చిత్రం అనౌన్స్ చేశాడు నితిన్. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తు్న్నారు. ఈ సినిమాకు ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైంది.”

వాస్తవానికి ఆదివారమే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంతో తన 28వ సినిమాను నితిన్ ప్రారంభించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాను ప్రకటించి 24 గంటలు కాకముందే మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు నితిన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘రంగ్ దే!’ నితిన్‌కు 29వ సినిమా. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించాడు నితిన్. అంటే దాదాపుగా ఏడాది సమయంలో నితిన్ ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేస్తాడు.

ఈ జనరేషన్ హీరోలకు అది ఒక రికార్డే అవుతుంది. ఈ జనరేషన్ హీరోలకు మూడు సంవత్సరాలకు రెండు సినిమాలు చేస్తే ఎక్కువ. సంవత్సరానికి ఒకటి వస్తే రికార్డు అన్నట్టు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే నితిన్ గత సినిమా శ్రీనివాస కళ్యాణం విడుదల తరువాత దాదాపుగా ఏడాది పాటు నితిన్ ఖాళీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం కు ముందు రెండు సినిమాలతో (లై, చల్ మోహన్ రంగా) కలిపి నితిన్ వరుసగా మూడు ప్లాపులు ఇచ్చాడు. ఇప్పుడు నితిన్ ఈ మూడు సినిమాలతో మూడు హిట్లు కొడతాడేమో చూడాలి.