టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’ ప్రమోషన్స్ ఈరోజు ప్రారంభం అయ్యాయి. అనుష్క ఈరోజు చాలా నెలల తరువాత మీడియా వారితో ముచ్చటించింది. తొలుత ఈ సినిమా ఈ నెలలో క్రిస్మస్ సందర్భంగా విడుదల చెయ్యాలని నిర్మాతలు భావించినా రష్ ఎక్కువగా ఉండటంతో ఆ ఐడియా విరమించుకున్నారు.
గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చెయ్యాలి అనుకున్నా రవితేజ డిస్కో రాజా చిత్రం ఉండటం ఆ నిర్ణయం కూడా మార్చుకున్నారు. తాజాగా జనవరి 31, 2020 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలో చిత్రీకరించింది ఆ చిత్ర బృందం.
అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్మొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ – హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు.
సౌత్ లో ఇప్పటికే అనుష్కకు మంచి క్రేజ్ ఉంది కాబ్బటి హిందీలో ఈ సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. బాహుబలి లో దేవసేనగా అదరగొట్టిన అనుష్క ఆ తరువాత కేవలం ఒకే ఒక్క సినిమాలో భాగమతిగా కనిపించింది. దాంతో అనుష్క నటించిన ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.