Nikhil-Siddharthaసెలబ్రిటీగ ఉన్నపుడు ఏది మాట్లాడిన అలోచించి మాట్లాడాలన్న సూక్తిని బహుశా యంగ్ హీరో నిఖిల్ ఈరోజు తెలుసుకునే ఉంటారు. లేనిచో..ఫాన్స్ వేడిని తట్టుకోడం అసాధ్యమే.

వివరాల్లోకి వెళితే, నోటా విడుదల అయినప్పటి నుండి విజయ్ దేవరకొండ మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు, మన ‘రౌడీ హీరో’ తన సినిమా పరాజయం పాలవడం పై ఒక లేఖని విడుదల చేసాడు. తనకు స్క్రిప్ట్ నచ్చిందని, అయితే ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషిస్తానని…విజయాపరాజయాలు శాశ్వతం కాదని పేర్కొన్నారు.

అయితే, చివరిలో తనదైన శైలి లో మాట్లాడుతూ..తన ఓటమిని కోరుకున్న వాళ్ళందర్నీ ఇప్పుడే వేడుక చేసుకోమని, త్వరలో మరో హిట్ తో తిరిగి వస్తానని తన మార్క్ ఆటిట్యూడ్ తో ట్వీట్ చేసాడు. ఇదిలా ఉండగా, అర్జున్ రెడ్డి ఆటిట్యూడ్ని జీర్ణించుకోలేని హీరో నిఖిల్ పరోక్షంగా విజయ్ దేవరకొండ ట్వీట్ ని ఉద్దేశించి…సినిమాలు చేసే ప్రతి నటుడు సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమేనని, అనవసరమైన ఆటిట్యూడ్, హైప్ల కన్నా..కష్టపడితే ఫలితం ఉంటుందని హితబోధన చేసాడు.

ఇది నచ్చని అర్జున్ రెడ్డి ఫాన్స్, హీరో నిఖిల్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక దశలో ట్రోల్ల్స్ సునామీని తట్టుకోలేక ట్వీట్ డిలీట్ చేసి, తాను ఎవర్ని ఉద్దేశించి అనలేదని చెప్పుకొచ్చిన నిఖిల్…కొద్దీ సేపట్లోనే ఆ ట్వీట్ కూడా డిలీట్ చేయడం గమనార్హం. చివరికి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు…విజయ్ దేవరకొండ ఒక మంచి నటుడు అంటూ ఫాన్స్ ట్రోల్ల్స్ కు అడ్డు తెర వేసాడు.