నలుగురు టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు కలిసి స్థాపించిన ‘వి4 మూవీస్’ సంస్థ నుండి రాబోతున్న తొలి సినిమా “నెక్స్ట్ నువ్వే” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. ‘ఈ టీవీ’ ప్రభాకర్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా ట్రైలర్ ‘ఫన్’ జనరేట్ చేయడంలో సక్సెస్ సాధించింది. తమిళ సినిమా ‘యామిరుక్క బయమేయ్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది హీరోగా నటించగా, వైభవి, రష్మి హీరోయిన్లుగా నటించగా, బ్రహ్మాజీ మరో ప్రధాన పాత్రలో నటించాడు.

హీరోగా అనేక ప్రయత్నాలు చేసిన ఆది, ఇప్పటివరకు సరైన సక్సెస్ ను అందుకోలేకపోగా, ఈ సినిమా మాత్రం ఆ అనుభూతులను తీరుస్తుందన్న నమ్మకాన్ని అయితే ఇచ్చింది. హార్రర్ కామెడీగా కనపడుతోన్న ఈ ట్రైలర్ కాస్త ఫ్రెష్ నెస్ తో కూడుకుని ఉంది. ప్రధానంగా బ్రహ్మాజీ కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందన్న సంకేతాలు కలుగుతున్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫోటోగ్రఫీ అంతా బాగానే ఉన్న ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది.