News Presenter Swapna to get a TTD post-టీవీ9 లో యాంకర్ గా, న్యూస్ ప్రేసెంటెర్ గా కేరీర్ ప్రారంభించిన స్వప్న అందరికీ సుపరిచితమే. దాదాపుగా పదేళ్లకు పైగా అక్కడ పని చేసి ఆ తరువాత సాక్షికి మారింది ఆమె. అక్కడ కొంత కాలంలోనే ఎండీ స్థాయికి చేరింది. ఆ తరువాత సాక్షి నుండి బయటకు వచ్చినా ఆ ఛానల్ కు ఇప్పటికీ కన్సల్టెంట్ గా ఉంది స్వప్న. యూట్యూబ్ లో ఒక వెబ్ ఛానల్ కు యాంకర్ గా చేస్తూ కూడా తన జగన్ భక్తి చూపించేది.

తాను చేసే ఇంటర్వ్యూలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాని ఇరుకున పెడుతూ…. జగన్ కు బాగా పుష్ ఇచ్చేవారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం దానితో తన వంతు చిన్న పాత్ర పోషించింది. దానిని ముఖ్యమంత్రి గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీబీసీకు ఆమెను డైరెక్టర్ గా నియమించినట్టు సమాచారం.

ఇప్పటికే ఎస్వీబీసీకు సినీ నటుడు పృథ్వి ఛైర్మన్ గా చేసిన సంగతి తెలిసిందే. సాక్షిలో పెద్ద జీతాలు తీసుకునే వారందరిని ఏదో ఒక పేరుతో ప్రభుత్వంలోకి తీసుకుని, నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టి వారికి దండిగా డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఆ పద్దతి ద్వారా సాక్షికి కూడా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది.

ఈ నియామకం దానిని మరింత బలపరిచే అవకాశం ఉంది. అయితే శ్రీవారి భక్తులు మాత్రం దేవస్థానాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని బాధ పడుతున్నా కనీసం దేవదేవుడి స్థాయికి తగినట్టు వారు పని చేస్తారని ఆశిస్తున్నారు.