Naveen Polishettyతన తొలి చిత్రం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న హీరో నవీన్ పొలిశేట్టి. జాతి రత్నలు అనే సినిమాతో రేపు మహా శివ రాత్రి సందర్భంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో, నటుడు తాను సినిమాకు ఎలా సిద్ధమవుతున్నాడో వెల్లడించాడు.

“షూట్ చేయడానికి ముందు రాత్రి నేను ఎప్పుడూ నిద్రపోను. నా పాత్ర కోసం నన్ను నేను మానసికంగా సిద్ధం చేస్తాను. నేను తెల్లవారు జాము 4 గంటలకు అనుదీప్ కు కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా పాత్రలు పరిపూర్ణంగా పోషించడానికి నన్ను నేను పూర్తిగా సిద్ధం చేసుకుంటాను” అని ఈ నటుడు వెల్లడించారు.

అయితే సరైన నిద్ర లేకుండా తెరపై అతను ఫ్రెష్ గా ఎలా కనిపిస్తున్నాడో అని ఆశ్చర్యపోతారు. తన మొదటి చిత్రంతో పిట్టగోడ లాంటి ప్లాప్ ను ఎదుర్కొన్న అనుదీప్ కెవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రమోషన్ల కారణంగా ఒకే రోజు విడుదలవుతున్న మిగతా రెండు చిత్రాల (శ్రీకారం, గాలీ సంపత్) కన్నా ముందస్తు బుకింగ్స్ బాగున్నాయి.

జీవితంలో దేనిని సీరియస్ గా తీసుకొని ముగ్గురు కుర్రాళ్ళు ఒక సీరియస్ క్రైమ్ లో ఇరుకున్నప్పుడు జరిగే కథ జాతిరత్నాలు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మిగతా ఇద్దరు రత్నాలు. మహానటి నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పూర్తిగా కామెడీ ఉంటుందని చిత్రబృందం చెబుతుంది.