Naniనేచురల్ స్టార్ నాని తన కెరీర్లో మైలురాయి 25 వ చిత్రమైన వీ తో ఊహించని వైఫల్యానికి గురయ్యాడు. దానితో ఈ నటుడు చాలా నిరాశకు గురైనట్లు సమాచారం. చాలా కాలం ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు కోలుకున్నాడట. అక్టోబర్ 5 నుండి తన టక్ జగదీష్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాడు.

రాజమండ్రి, హైదరాబాద్, విశాఖపట్నంలలో ఈ సినిమా షూట్ జరగబోతుంది. లాక్డౌన్ ముందు సినిమా షూటింగ్ 40% పూర్తయింది. నాని స్టైల్ లో ఉండే ఈ చిత్రం 2021 మొదటి భాగంలో విడుదల కానుంది. ఇంతకుముందు నానికి నిన్ను కోరి లాంటి హిట్‌ను అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శివ నిన్ను కోరి తరువాత నాగ చైతన్య యొక్క మాజిలి వంటి మరో హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. జగపతి బాబు కీలక పాత్రలో ఉన్న ఈ చిత్రంలో రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ మహిళా కథానాయకులు. 2017 లో తన ఎంసిఎ తర్వాత నానికి సరైన హిట్ లేదు. ఈ చిత్రం విడుదల కోసం అతను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటాడు.

ఈ చిత్రం తరువాత, నానీకి శ్యామ్ సింఘా రాయ్ వంటి మరో ప్రామిసింగ్ సినిమా లైన్ లో ఉంది. విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో డెబ్యూ చేసిన రాహుల్ ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. ఆ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.