Narendra Modi top powerful Indiansఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ie100 పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. 2015-16, 2016-17 జాబితాలోనూ మోదీ తొలిస్థానంలోనే ఉండటం విశేషం.

బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు. అమిత్‌ షా రెండో స్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి. అయితే ఈ జాబితాపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నరేంద్ర మోడీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా ఒక సాధారణ అవిశ్వాసతీర్మాణంకు బయపడి పారిపోతున్నారు అని అక్షపిస్తున్నారు.

దాదాపుగా 15 రోజులుగా సభ సజావుగా లేదు అనే వంకతో సభ వాయిదా వేయిస్తూ అవిశ్వాసాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెడితే తిరగబడతారేమో అని వారు భయపడుతున్నారని అక్షపిస్తున్నారు. అటువంటప్పుడు వారు అత్యంత శక్తిమంతులు ఎలా అవుతారని గేలి చేస్తున్నారు. అది కూడా నిజమే కదా మరి!