2014లో భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఆ తర్వాత 2015 డిసెంబరులో నవాజ్షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని లాహోర్లో ఆగి షరీఫ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అంతా భావించారు. అయితే పాకిస్తాన్ ఎప్పటిలానే తన నిజస్వరూపం చూపించి దాడులకు తెగబడింది. ఇప్పుడు ప్రధాని మోదీని ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించాకా ఇమ్రాన్ఖాన్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానింపబడ్డారు.
ఆహ్వానం అందాకా మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ సోమవారం ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేశారు. “పాకిస్థాన్, భారత్ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని,” మోదీ ఇమ్రాన్ఖాన్తో అన్నట్టు సమాచారం.