Pawan Kalyan - chandrababu Naiduదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయని, ఈ నేపథ్యంలో ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’ పేరిట జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ కమిటీ ప్లాన్ చేస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల నుండి… ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కమిటీలోకి తీసుకున్నారు. దర్శకుడు రాజమౌళి, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా, రామోజీ గ్రూప్‌ అధినేత రామోజీరావు తదితరులు కూడా కమిటిలో చోటు దక్కించుకున్నారు.

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ని తీసుకోనందుకు జనసైనికులు మోడీ ప్రభుత్వం పై గుస్సా అవుతున్నారు. మితపక్షం అధినేతను కాదని చంద్రబాబుని ఎంపిక చెయ్యడం ఏంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో స్థానం దక్కింది అని బీజేపీ వారు చెబుతున్నా వారు సమాధాన పడటం లేదు.

“రాజకీయ కోణంలో కుదరకపోతే ప్రముఖుల స్థానంలో సినిమాలో కోటా లో రాజమౌళిని తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ని తీసుకోవాల్సింది. ఒకవేళ అలా చేస్తే మోడీ ప్రభుత్వాన్ని కాదని అనగలిగే వారు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షమైన తమ అధినేతకు బీజేపీ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.