Nara-Lokesh- Kodali Naniరెండ్రోజుల క్రితం కర్నూల్ లో ఫ్యాక్షన్ కక్షల లో బలైన తమ పార్టీ నాయకుల కుటుంబాలను టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వెళ్లి పలకరించి వచ్చారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ ఫ్యాక్షన్ కు పాల్పడుతున్నారు అంటూ అధికార పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు… ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఏకవచనంతో సంబోధించారు.

సహజంగా అటువంటి పరుష పదజాలం చంద్రబాబు నాయుడు వాడరు. పైగా అటువంటి భాషతో తిట్టించుకుంటారు కూడా. అయితే లోకేష్ ఈ మధ్య కాలంలో కొంత గట్టిగా మాట్లాడుతున్నారు. తన మీద మెతక, పప్పు అంటూ చేసిన ప్రచారాన్ని ఆ భాషలోనే తిప్పికొడుతున్నారు. అయితే ఈ యాంగిల్ కు సరైన ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ఎప్పటిలానే ఇబ్బంది పడుతుంది.

దానితో టీడీపీ సహజ స్వభావానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ఏకవచనంతో సంబోధించారు. అయితే దానితో అధికార పార్టీ వారు మీడియా ముందుకు వచ్చి నోరు జారారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, మంత్రి కొడాలి నాని తమదైన శైలిలో లోకేష్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కళ్ళలో పడాలనే తపనో ఏమో గానీ ఏం మాట్లాడుతున్నామో కూడా చూడకుండా మాట్లాడేసారు.

అయితే వారు ఎందుకు అంత రెచ్చిపోతున్నారు అనే కుతూహలం నేపథ్యంలో అసలు లోకేష్ ఏం మాట్లాడాడు అంటూ యూట్యూబ్ లో వెతకడం మొదలుపెట్టారు. ఆ రకంగా లోకేష్ లోని ఆ కొత్త యాంగిల్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే ప్రచారం చేసినట్టు అయ్యింది. ఒకరకంగా ఈ విషయంలో లోకేష్ ట్రాప్ లో అధికార పార్టీ నేతలు పడ్డారు అనే చెప్పుకోవాలి.