Nara Lokesh - YS Jaganకేవలం అధికారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, వైసీపీ చేస్తోన్న నీచ రాజకీయాలు మరోసారి బహిర్గతం అవుతున్నాయి. ఓ పక్కన కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా టిడిపి అన్ని యత్నాలను కూడగడుతుంటే, దీనికి తోడ్పాటును అందించాల్సింది పోయి, సంబంధం లేని విమర్శలతో జగన్ మరియు ఆయన మీడియా నిమగ్నమై ఉంది.

ముఖ్యంగా దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన “ఈజ్ ఆఫ్ డూయింగ్”పై జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసాయి. అయితే ఇందులో జగన్ తప్పేం లేదంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. అవును… నిజమే.., జగన్ కు అనుకూలంగా ఆయన తప్పేం లేదని స్వయంగా నారా లోకేష్ ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ వెలువడ్డాయి.

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ర్యాంకు దొంగాబ్బాయ్ కు తెలుస్తుందని ఎలా అనుకుంటారు? అవినీతిలో గానీ, తెరవెనుక డీల్ మేకింగ్ అంశాలలో గానీ ఆయన్ని అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఏపీకి నెంబర్ 1 ర్యాంకు రావడం ఆయనకు ప్రశ్నలు ఉంటాయి, అలాగే అవినీతిలో జగన్ కు నెంబర్ 1 ర్యాంకుకు సంబంధించిన ప్రశ్నలు సీబీఐ వద్ద ఉన్నాయంటూ” ఎటకారపు బాంబ్ పేల్చారు.