కృష్ణా పుష్కరాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర సంగమం వద్ద జరిగిన హారతి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో ఘనంగా నిర్వహించడంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం విజయవంతం అయ్యింది. అలాగే విచ్చేసిన జనాలు, స్నానమాచరిస్తున్న భక్తులు, మీడియా వర్గాలు కూడా ఈ ఏర్పాట్లను చూసి ముగ్దులయ్యారు… ఒక్క సాక్షి మీడియా తప్ప… అంటున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
పుష్కరాలు ఫెయిల్ కావాలని సాక్షి ప్రార్ధనలు చేస్తోందని… సాక్షిలో తప్ప మిగతా మీడియా ఛానల్స్ లో ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి సరైన సమాచారం చూడవచ్చని… లోకేష్ వ్యంగ్యాస్త్రాలతో కూడిన ట్వీట్లు చేసారు. ప్రభుత్వం చేసేటటువంటి ఎలాంటి కార్యక్రమం పైన అయినా… వ్యతిరేక ప్రచారం చేయడం జగన్ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య కావడంతోనే… లోకేష్ వ్యాఖ్యలను సమర్ధించే వారి సంఖ్య పెరుగుతోంది.
పుష్కరాల వంటి ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినపుడు అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాటులు కనపడుతూనే ఉంటాయి. అయితే వీటిని హైలైట్ చేస్తూ… అసలు కార్యక్రమాన్నే తప్పు పట్టే విధంగా ప్రసారాలు చేయడం తగదన్న భావన అన్ని వర్గాల నుండి వ్యక్తమవుతోంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కంటే కూడా… కోట్లాది భక్తులు నమ్మకంతో కొలిచే పవిత్ర కార్యక్రమంగా భావిస్తే… తప్పుడు కధనాలకు చోటు ఉండదన్న హితకరమైన మాటలు జగన్ మీడియాకు చెబుతున్నారు.