Nara-Chandrababu-Naidu-interacts-with-young-minds-of-IIT-Bombayఇటీవలే ఐఐటీ బొంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రత్యేక గెస్ట్ గా పిలిచారు. నాయకత్వ లక్షణాలు, యువత భాగస్వామ్యం వంటి విషయాల గురించి చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఇంప్రెస్ చేశారు. దీనికి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ ఎదురుదాడి ప్రారంభించింది.

అసలు ఆ ఈవెంట్ ఫేక్ అని, అందరు పాల్గొన్న విద్యార్థులు ఐఐటీకి చెందిన వారు కాదని, టీడీపీ కార్యకర్తలని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిని టీడీపీ సోషల్ మీడియా వారు రుజువులతో సహా నిరూపించారు. టీడీపీని ఎటాక్ చెయ్యడానికి రాంగ్ ఇష్యూని ఎంచుకున్నారు.

కాసేపు చంద్రబాబు మేనేజ్ చేశారు అనుకుందాం అదే ఐఐటీ ముంబై అలంకార్ కార్యక్రమంలో శ్యామ్ పిట్రోడా ఉన్నారు , నీతి ఆయోగ్ మాజీ అధిపతి అరవింద్ పనగరియా, జావేద్ అక్తర్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. స్టూడెంట్స్ ని మ్యానేజ్ చేశారు అనుకుందాం ప్రముఖులను కూడా మ్యానేజ్ చేస్తారా?

ఆ కార్యక్రమం స్పాన్సర్ చేసింది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి హేమాహేమీలు సంస్థలు. అటువంటి కార్యక్రమం మీద అభాండాలు వేసి అభాసుపాలయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా యమా యాక్టీవ్ గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధికారంలోకి వచ్చాకా డిఫెన్స్ లో పడింది.