Nara Brahmini-Upasana Kamineniఓ పక్కన నంది అవార్డులలో చిరంజీవి కుటుంబానికి అన్యాయం జరిగిందని, దీనికి కారణం నందమూరి బాలకృష్ణ అని, మెగా వర్గీయులు మరియు అభిమానులు ఓ రేంజ్ లో మండిపడుతుండగా, మరో పక్కన ఈ ఇద్దరు కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఒకరికొకరు ఎంతో ఆప్యాయతతో మెలగడం విశేషం.

అవును… చిరు కోడలుగా అడుగుపెట్టిన కామినేని ఉపాసన మరియు బాలకృష్ణ తనయురాలు, నారా లోకేష్ సతీమణి అయిన బ్రాహ్మణి ఇద్దరూ కలిసి ఈ రోజు రక్తదానం చేసారు. ఈ సందర్భంగా ఓ ఫోటో తన సోషల్ మీడియాలో ఉపాసన పోస్ట్ చేయడంతో… అది కాస్త వైరల్ అవుతూ హంగామా చేస్తోంది.

ముఖ్యంగా… ప్రస్తుతం చిరు – బాలయ్యల నడుమ అగ్ని రాజేసే క్రమంలో కొందరు ఉండగా, మరోవైపు ఈ ఇద్దరు ఆడపడుచులు కలిసి సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేసారు. 18వ ఏట నుండి ప్రతి 90 రోజులకు ఒకసారి రక్తదానం ఇస్తే, 60 ఏళ్ళు వచ్చేసరికి 500 మందిని సేవ్ చేసిన వారవుతారని ఉపాసన సందేశం ఇచ్చింది.

ఈ దానం చాలా పవర్ ఫుల్ అని, అంతేగాక ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని చెప్పిన ఉపాసన, మేమిద్దరం అయితే మంచి సమయం గడిపామని స్పష్టం చేసారు. చాలా రేర్ గా చెప్పుకునే క్లిక్స్ లో ఈ ఫోటో కూడా చేరుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి మీరూ ఓ లుక్కేయండి..!