సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా, ప్రిన్స్ మహేష్ బాబు బావగా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన సుధీర్ బాబు, ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. ఇటీవలే ‘సమ్మోహనం’ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సుధీర్, తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించారు. ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’పై తొలి సినిమాగా “నన్ను దోచుకుందువటే” నిర్మిస్తుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టగలిగారు.
తాజాగా ఈ సినిమా స్టీలర్ (టీజర్)ను విడుదల చేయబోతున్నట్లుగా సుధీర్ బాబు ప్రకటించారు. జూలై 14వ తేదీ ఉదయం 10.02 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తెలిపారు. ల్యాప్ టాప్ ను రోడ్డు మీద పెట్టుకుని కూర్చున్న సుధీర్ స్టైలిష్ గా కనపడుతుండగా, కారులో నుండి హీరోను చూస్తోన్న హీరోయిన్ నభ నటేష్ క్యూట్ గా కనపడుతోంది. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు చోట కే నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమకూరుస్తున్నారు.