Nannu Dochukunduvate - Mounam Maatathoti Songహీరో సుధీర్ బాబు కాస్త నిర్మాతగా కూడా మారి, మొదటిసారిగా “నన్ను దోచుకుందువటే” సినిమా ద్వారా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసి, ప్రేక్షకుల మనసు దోచుకునే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్.

మౌనం మాటతోటి ఊసులేవో చెప్తోంది… అంటూ మొదలైన ఈ మెలోడీలో ‘మండే మండే వేసవిలో ఓ స్టోరీ మొదలైందే… మండే కూడా సండేలా అందంలా గడిచిందే…’ అనే లిరిక్స్ వినగానే ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ స్వయంగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. మొత్తమ్మీద ఫస్ట్ సాంగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.