Nani-Responds-on-Sri-Reddy-Allegationsతనపై అనేక అభియోగాలు చేస్తూ వస్తోన్న శ్రీరెడ్డిపై మొదటిసారిగా నాచురల్ స్టార్ నాని స్పందించారు. ‘నేను కుట్రకు బలయ్యే విధంగా స్పందించను, అలాగే వాళ్ళు కోరుకుంటున్నట్లుగా చేయను, చట్టపరంగా వెళ్తున్నాను, న్యాయపరమైన నోటీసులు ఇప్పటికే డిస్పాచ్ అయ్యాయి, పరువు నష్టం దావా వేయబోతున్నాను’ అంటూ శ్రీరెడ్డి ఉదంతాన్ని నాని తేల్చేసారు.

ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తూ సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న వైనం తనను ఇబ్బంది పెట్టిందని, అయినా తన ఆందోళన తన కోసం కాదని, మనం నివసించే సొసైటీ కోసమని నాని తెలిపారు. ఇంకా దీనిపై మున్ముందు తాను స్పందించను అంటూ తన ఉద్దేశాలు ఏమిటో నాని స్పష్టంగా చెప్పేసారు. కేవలం న్యాయపరంగానే పోరాడుతానని నాని తేల్చేయడంతో బాల్ శ్రీరెడ్డి కోర్టులో పడనుంది.

నాని వివరణ మరియు శ్రీరెడ్డిపై పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసుకు సంబంధించిన పేపర్లు సోషల్ మీడియాకు కూడా ఎక్కాయి. అనవసరంగా మీడియాకెక్కి శ్రీరెడ్డిని మరింత పాపులర్ చేయడమో లేక మీడియా వర్గాలకు ఇంకో అవకాశం కల్పించడమో చేయడం ఇష్టం లేని నాని సరైన స్టెప్ తీసుకున్నారని చెప్పవచ్చు. దీంతో ఇక నుండైనా సాక్ష్యాలు లేని ఆరోపణలు చేయకుండా ఉంటుంది, ఒకవేళ సాక్ష్యాలు ఉంటే బయట పెడుతుంది.