టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు అంతిమయాత్ర ప్రారంభమైంది. నరసరావుపేట కోట సెంటర్లోని ఆయన స్వగృహం నుంచి ఈ యాత్ర మొదలైంది. పల్నాడులోని అన్ని ప్రాంతాల నుంచి అంతిమయాత్రకు తరలివచ్చిన జనసందోహంతో కోటసెంటర్ కిక్కిరిసిపోయింది. గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఇప్పటికే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అంతిమ యాత్ర రధంపై నందమూరి బాలకృష్ణ కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది.
మొత్తం అంతిమయాత్రలో బాలయ్య ఉంటారట. బాలయ్యది, కోడెలది ఎనలేని అనుబంధం. ఎన్టీఆర్ క్యాన్సర్ తో పరమపదించిన తన సతీమణి బసవతారకం పేరు మీద క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలనప్పుడు ఆ బాధ్యత కోడెలకు అప్పగించారు. ఆసుపత్రిని మొదటి నుండి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. దానితో కోడెల అంటే బాలయ్యకు ఎనలైని ప్రేమ. కోడెల మృతి చెందడం అది కూడా ఆత్మహత్య చేసుకోవడం బాలయ్యను ఎంతగానో కలచివేసింది.
దానితో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అందుకనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు అంతిమయాత్రలో కోడెల పార్థివ దేహం కూడానే బాలయ్య ఉన్నారు. అభిమానులు అల్లరి చేస్తున్నా విషణ్ణ వదనంతో అందరికీ నమస్కరిస్తూ వెళ్తున్నారు బాలయ్య. ఇవన్నీ చూసి తెలుగుదేశం నాయకులు, అభిమానులు పొంగిపోతున్నారు. మా బాలయ్య బంగారం… మన అనుకుంటే ఎందాకైనా వెళ్తాడు అని వారంతా మురిసిపోతున్నారు. బాలయ్య నిజంగానే బంగారం.