nagarjuna praising junior ntr‘కింగ్’ నాగార్జున నటించిన సినిమా “ఊపిరి” మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నటించడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచిన నాగార్జున, ముందుగా కార్తి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను ఎంచుకున్న విషయంపై స్పందించారు. ‘తారక్ ను సంప్రదించిన మాట నిజమేనని, తారక్ కూడా ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపారని, అయితే తర్వాత డేట్స్ కుదరక పోవడంతో, ఈ ప్రాజెక్ట్ నుండి తారక్ తప్పుకున్నాడని’ చెప్పారు నాగ్.

అయితే ఈ కధలో నటించాలనే నిర్ణయం తారక్ తీసుకున్నదే గానీ తానేమీ చెప్పలేదని, మంచి కధలు ఎంచుకుంటే, అవే స్టార్ డంను తెచ్చిపెడతాయని మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటానని, తారక్ అలా ఎంచుకోవడం వలనే, 30 ఏళ్ళ లోపే స్టార్ డంను అనుభవించాడని, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా 30 సంవత్సరాల తర్వాతే స్టార్ డం వచ్చిందని… జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు కింగ్.

త్వరలో జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలతో “గుండమ్మ కధ” రీమేక్ కూడా ఆలోచనలో ఉన్నట్లుగా నాగ్ చెప్పడంతో అభిమానులు ఈ ఆనందదాయకమైన వార్త కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘గుండమ్మ కధ’ రీమేక్ విషయం ఇప్పటిది కాకపోయినా… తెరపైకి వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది. అంతలా అలనాటి ఆ ‘గుండమ్మ’ ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఈ తరం ‘గుండమ్మ’ దొరకకే ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతోందన్న విషయం ఇప్పటిది కాదేమో..!