గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాను విపరీతంగా ఊపేస్తున్న అంశాలలో అక్కినేని వారి ఫ్యామిలీ విషయం కూడా ప్రధానంగా మారింది. కింగ్ నాగార్జున ఇద్దరు తనయుల ప్రేమ వివాహాలు నెటిజన్ల పాలిట వరంగా మారాయి. దీనికి తోడు ఇంటర్నెట్ లీక్ అయిన ఫోటోలు సదరు అంశాలను ఎప్పుడూ లైంలైట్ లో ఉండేలా చేసాయి. అయితే ఎట్టకేలకు నాగచైతన్య, అఖిల్ వివాహాలపై నాగార్జున స్పందించారు.
చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం తనకు, భార్య అమలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇద్దరు తనయుల వివాహాలపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని తెలిపారు. అయితే దీనికి కావాల్సింది మంచి ముహూర్త సమయం కోసమేనని, అది చూసుకుని అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పడంతో త్వరలోనే అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మ్రోగడం ఖాయమని ఖరారైంది.
ఇంతకీ, చైతూ, అఖిల్ ల జోడిల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటారా… సోషల్ మీడియాను ఊపేసిన చైతూ – సమంత ఫోటోలు, సైలెంట్ గా పని కానిచ్చిన అఖిల్ మరియు ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ల బంధం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఒకేసారి చేస్తారా? లేక విడివిడిగా చేస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. సినిమాలలో తప్ప, నిజ జీవితంలో ఇద్దరి కుమారుల వివాహాలు ఒకేసారి జరపరు. మరి కింగ్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.