Nagarjuna Given Shock to Ktrరాజకీయ నాయకులు ‘లైవ్’ షోకు వస్తే సామాన్య ప్రజానీకం తమ గోడు చెప్పుకోవడం మామూలే గానీ, ఏకంగా ఓ సెలబ్రిటీ వచ్చేసి, మా కోరికను పరిశీలించాల్సిందిగా కోరితే ఎలా ఉంటుంది? ఆ అనుభూతులను తెలుసుకోవాలంటే రాజకీయ నాయకుడి పాత్రలో మెరిసిన కేటీఆర్ – సెలబ్రిటీ పాత్రను పోషించిన నాగార్జునను అడిగి తెలుసుకోవాలి.

తెలంగాణ ‘ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ’ మంత్రి కె.తారక రామారావు ఓ టీవీ చానల్ లైవ్ షోలో పాల్గొన్న సమయంలో… ఊహించని విధంగా ‘కింగ్’ నాగార్జున ఫోన్ చేశారు. టీవీ ప్రేక్షకులు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇస్తున్న వేళ, నాగార్జున లైవ్ లోకి వచ్చేసరికి కేటీఆర్ తో పాటు, వీక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

“ఈ సంక్రాంతి సీజన్ లో పలు తెలుగు చిత్రాలు భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయని, పైరసీని అరికట్టాలని విన్నవించారు. పైరసీ భూతం కలెక్షన్లను దెబ్బతీస్తోందని చెప్పిన నాగార్జున, దీన్ని అరికడితేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమని” అన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్, ‘శివ’ చిత్రం నుంచి తాను నాగ్ వీరాభిమానిగా మారిపోయానని గుర్తు చేసుకున్నారు. పైరసీని నివారించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం ద్వారా జనవరి 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘కింగ్’ నాగ్.