nagarjuna follows samanthaకింగ్ నాగర్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న తదుపరి చిత్రం… షూటింగ్ ఈ నెల చివరిలో తిరిగి ప్రారంభించనున్నారు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చెయ్యగలిగారు. మరోవైపు…. నాగార్జున డిజిటల్ అరంగేట్రం చెయ్యబోతున్న ఓటీటీ ప్రాజెక్టు ఒకే అయ్యిందని సమాచారం. .

దానికి సంబంధించిన అధికారిక ప్రకటన జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో జరుగుతుందట. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి… అలాగే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు…. అలాగే నాగ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నారట.

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు ఈ ప్రాజెక్టుతో తన ఓటీటీ అరంగేట్రం చేయనున్నారని తెలిసింది. అయితే అది వెబ్ సిరీస్ లేదా సినిమానా అనేది మనకు ఇంకా తెలియలేదు. ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న మొదటి టాలీవుడ్ స్టార్ నాగార్జున. ఈ నెల ప్రారంభంలో, నాగార్జున కోడలు సమంతా అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ది ఫ్యామిలీమాన్ 2 తో ఓటీటీ అరంగేట్రం చేసింది.

కాబట్టి, నాగార్జునకు కోడలి ఓటీటీ అనుభవాలు ఉపయోగపడనున్నాయి. ఇది అలా ఉండగా… ఇంతకుముందు నాగ చైతన్య తన ఓటీటీ అరంగేట్రం కోసం చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అది కూడా కంఫర్మ్ అయితే అక్కినేని ఫ్యామిలీ (ఒక్క అఖిల్ తప్ప) మొత్తం ఓటీటీ వైపు చూస్తున్నట్టే అని చెప్పుకోవచ్చు.