టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఇటీవల కాలంలో తన కుమారులు నాగచైతన్య, అఖిల్ లతో టైమ్ బాగా సస్పెండ్ చేస్తున్నారు. ‘నా కుమారులతో కలసి గొప్ప సాయంత్రాన్ని ఎంజాయ్ చేశా’ అంటూ తాజాగా ఓ ఫొటోను నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అఖిల్, శ్రియా భూపాల్ ల నిశ్చితార్థం ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారం నాడు చలన చిత్ర ప్రముఖులకు నాగార్జున గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈ పార్టీలో సందర్భంగా ఈ అక్కినేని హీరోలు ముగ్గురూ దిగిన ఫోటో అభిమానులను అలరిస్తోంది. ఒక తండ్రి మాదిరి కాకుండా, ఏదో స్నేహితుడో లేక చైతూ, అఖిల్ ల బ్రదర్ మాదిరో కలిసిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడుతోంది. టాలీవుడ్ లోనే కాదు, బయట కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయగలిగే తండ్రి కొడుకులను చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ సందర్భంగా… దటీజ్ అక్కినేని… అంటున్నారు అభిమానులు..! కాదనలేం మరి..!