“ఖైదీ నంబర్ 150” ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన హంగామా తెలిసిందే. వర్మ, యండమూరిలను టార్గెట్ గా చేసుకుని ‘టవర్ స్టార్’ చేసిన వ్యాఖ్యలు సంచలనం కాగా, ఆ తర్వాత వర్మ నుంచి కౌంటర్ ఎటాక్ రాగా, యండమూరి మాత్రం నాగబాబు వ్యాఖ్యలను తేలికగా తీసుకున్నారు. ఎ హంగామాతో మొత్తంగా చిరు ‘ఖైదీ’ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ దక్కగా, ప్రస్తుతం ఆ సినిమా సందడి కూడా ముగిసిపోగా, తాజాగా మరొకసారి నాగబాబు ఆ ఇద్దరిపై స్పందించారు.

తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం ట్వీట్లు చేస్తుంటే, ఎవరో ఒకరు స్పందించాలి కాబట్టి ఆనాడు నేను ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది. ఒకటికి పదిసార్లు మాట్లాడితే అబద్దాలు కూడా నిజమనుకునే ప్రమాదం ఉంది కనుక, వాటిని ఖండిస్తూ తానూ ఆ వ్యాఖ్యలు చేశాను, అయితే కాస్త హార్ష్ గా కాకుండా, మర్యాదపూర్వకంగా చెప్పుంటే బాగుండేదని తన వ్యాఖ్యలలోని ఆంతర్యాన్ని అంగీకరించారు. అయితే అంత హార్ష్ గా మాట్లాడినా వారికి ఎక్కలేదంటూ మరో వ్యాఖ్య చేయడం కొసమెరుపు.

ఆ ఇద్దరితో తనకు ఎన్నడు విభేదాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని, వారేమీ అన్నా కూడా పట్టించుకోబోనని ఈ సందర్భంగా నాగబాబు స్పష్టం చేసారు. ఓ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సదరు విశేషాలను చెప్పుకొచ్చారు నాగబాబు. తన కుమారుడు వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న గమ్యం పట్ల, చేస్తోన్న సినిమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, వినూత్నమైన సినిమాలను చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.