Naga Chaitanya Love Story Movie postponedనాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుంది. మొదట్లో ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చెయ్యాలి అనుకున్నా ఆ తరువాత నిర్మాతలు తమ అభిప్రాయం మార్చుకున్నారు.

సినిమా జులైకి వాయిదా పడబోతుందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని మే 29న సినిమా విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అప్పటికీ వేసవి సినిమాల హవా తగ్గుతుంది. పైగా జూన్ రెండో వారం వరకూ సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. దీనితో ఇది మంచి డేట్ అనే చెప్పుకోవాలి.

కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో ఈ సినిమాగా తీస్తున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు.