Naga Chaitanya Love Story Movie postponedనాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దుబాయ్ లో ఒక కీలక షెడ్యూల్ జరుగుతుంది. మొన్న ఆ మధ్య ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు వాయిదా పడినట్టు సమాచారం.

మొత్తంగా వేసవి హాలిడేస్ ని మిస్ చేసుకుని జులైలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అక్కినేని అభిమానులు ఈ నిర్ణయం మీద పూర్తిగా నిరాశగా ఉన్నారు. హాలిడేస్ ఎడ్వాంటేజ్ మిస్ చేసుకుని డ్రై సీజన్లో రావడం అంటే రిస్క్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అనే దాని మీద సమాచారం లేదు.

ఎందుకనో ఈ సినిమాకు మొదటి నుండి అవాంతరాలే. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో ఈ సినిమాగా తీస్తున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు.