నాగచైతన్య, సాయి పల్లవి హీరోహెరాయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన లవ్ స్టోరీ ‘ఏయ్ పిల్లా’ సాంగ్ చాలా బాగుంది. అందులో ఏ పిల్లా అంటూ మరోసారి మాయ చేసింది సాయి పల్లవి. ముఖ్యంగా చైతూను ముద్దు పెట్టే సీన్ అయితే అదుర్స్ అంతే. ఈ పాటతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.
ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ కు ఉబ్బితబ్బిబైపోయాడు నాగచైతన్య. దీనితో హీరో నాగ చైతన్య తన దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రేమగా ఓ గిఫ్ట్ను బహుకరించాడు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చైతూ బహుకరించిన కళ్లజోళ్లు పెట్టుకుని ఓ ఫోటో పంచుకున్నాడు.
ఈసందర్భంగా చైతన్యకు ధన్యవాదాలు తెలుపుతూ… నెక్ట్స్ టీజర్ వస్తోంది. దానికి కూడా మరో గిఫ్ట్ను తయారు చేసుకోమ్మని సరదాగా పోస్ట్ చేశాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ దాస్ నారంగ్, పీ రామ్ మోహన్రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెహ్మాన్ శిష్యుడు సీహెచ్ పవన్ సంగీతమందిస్తున్నాడు.
శేఖర్ కమ్ముల ఈ మధ్యనే ఫిదాతో పెద్ద హిట్ ఇచ్చాడు. అలాగే నాగచైతన్య కూడా మజిలీ, వెంకీ మామ వంటి సినిమాలతో ఫామ్ లోనే ఉన్నాడు. ఇక యూత్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీనితో ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని సన్నాహాలు చేస్తున్నారు.