Naga Chaitanya essaying three roles in director vikram movieగతంలో అక్కినేని కుటుంబానికి మనం వంటి అద్భుతమైన సినిమా ఇచ్చిన విక్రమ్ కె కుమార్ తో యువ సామ్రాట్ నాగ చైతన్య థాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. విక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నాడట. మరోవైపు… దీనికి సంబంధించిన కాస్టింగ్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని సమాచారం.

ఈ సినిమాలో నాగ చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. అందులో ఒక పాత్ర రైతు కాగా మరో పాత్ర ఎన్నారై అని సమాచారం. మూడో పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆ పాత్రల కోసం… సమంత, రష్మిక, ప్రియాంక అరుల్ మోహన్ లను అనుకుంటున్నరట.

ఈ సినిమా మీద అక్కినేని అభిమానులలో అంచనాలు భారీగా ఉండబోతున్నాయి. మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు మరి విక్రమ్. అయితే మనం తరువాత విక్రమ్ కు ఆ స్థాయి సినిమా రాలేదు. అసలైతే అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. దీనితో కసిగా పని చేస్తున్నట్టు సమాచారం.

ఈ చిత్రం కోసం అతను మొదటి సారిగా బయట కథతో సినిమా చేస్తున్నాడు. రైటర్ – దర్శకుడు బీవీఎస్ రవి కథ ఇస్తున్నాడు. గతంలో జోష్ అనే సినిమాతో నాగచైతన్యను పరిచయం చేసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.