Naga Chaitanya Akkineni to play as telangana boy in  sekhar kammula movieయువ సామ్రాట్ నాగచైతన్య 20వ చిత్రం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ తన 20వ సినిమాలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవలేహైదరాబాద్‌లో జరిగాయి. సెప్టెంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

గతంలో ఫిదా కూడా ఇదే విధంగా తెరకెక్కించి విజయం సాధించాడు కమ్ముల. అయితే ఈ సినిమాకు అది సక్సెస్ ఫార్ములానా? మూస ధోరణా? అనేది సినిమా ఫలితం బట్టే ఉంటుంది. ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. కాగా మజిలీతో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామలో నటిస్తున్నాడు.

బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శేఖర్ కమ్ములతో సినిమా అనగానే తన వేరే కమిట్ మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చాడు ఈ అక్కినేని హీరో. మరి దీనితో ఆయన ఇంకో హిట్ కొడతాడా అనేది చూడాల్సిఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు.