Nag Ashwin next movie announcedసీనియర్ నిర్మాత అశ్విని దత్ తన అల్లుడు నాగ్ అశ్విన్ తో కలిసి మహానటి వంటి అపురూపమైన చిత్రాన్ని అందించారు. ఏడాది పైగా విరామం అనంతరం నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాను కూడా వైజయంతీ మూవీస్ నే నిర్మిస్తుంది. కొద్దిసేపటి క్రితం వైజయంతి మూవీస్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసి వార్తలలో నిలిచింది. తాము వచ్చేనెలలో మొదలుపెట్టనున్న భారీ చిత్రంలో పనిచేయుటకు విజువల్ ఆర్టిస్ట్స్,డిజైనర్స్, మరియు రైటర్స్ కావాలంటూ ప్రకటించారు.

వారు అడిగిన సాంకేతిక నిపుణులను పరిశీలించినట్లైతే ఇది అడ్వెంచర్స్ తో కూడిన భారీ పీరియాడిక్ మూవీ అని అర్థం అవుతుంది. దీనిబట్టి సినిమా మీద ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఐతే కేవలం ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని స్పష్టం చేసిన చిత్ర యూనిట్,నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దీనితో సినీ అభిమానులలో ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి ఉంది. త్వరలో పూర్తివివరాలు వెల్లడించే అవకాశం ఉంది..

నాగ్ అశ్విన్ ఈ స్క్రిప్ట్ మీద దాదాపుగా ఏడాది పని చేసి అంతా పగడ్బంధీగా సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా తెర మీదకు వెళ్తుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మధ్య అశ్విని దత్ సినిమాలు బాగా తగ్గించారు. తనకు బాగా నమ్మకం ఉన్న స్క్రిప్టుల మీదే ఆయన డబ్బులు పెడుతున్నారు. దీనితో ట్రేడ్ కూడా ఈ చిత్రం మీద ఒక కన్నేసింది. ఈ సినిమా హిట్ అయితే నాగ్ అశ్విన్ తో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా చెయ్యనున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.