Nabta-Natesh“నన్ను దోచుకుందువటే” సినిమాతో ప్రేక్షకుల మనసులను మాత్రమే కాదు, టాలీవుడ్ దర్శకనిర్మాతలను కూడా భారీ స్థాయిలోనే హీరోయిన్ నభా నటేష్ దోచుకున్నట్లుగా అర్ధమవుతోంది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా తన చలాకీ నటనతో కనిపించిన, రెండవ రోజే ఓ భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందన్న టాక్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో ఊపందుకుంది.

మాస్ మహారాజా రవితేజ – విఐ ఆనంద్ కాంభినేషన్ లో రూపుదిద్దుకోబోయే సినిమా కోసం నభా నటేష్ ను ఎంపిక చేసారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని లభించిన కీలక సమాచారం. నిజానికి రవిబాబు ‘అదుగో’ సినిమాతో పరిచయం కావాల్సిన ఈ బ్యూటీ, ఆ సినిమా వాయిదాలు పడుతూ వస్తుండడంతో సుధీర్ బాబు “నన్ను దోచుకుందువటే” సినిమాతో అందరినీ దోచుకుంటోంది.